శర్వానంద్, ప్రియాంక మోహన్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా శ్రీకారం. ఈ ఏడాది విడుదలైన సినిమాలలో ఇది ఒక్కరు. ఈ సినిమాను 14 రీల్స్ సంస్థ నిర్మించింది. మహా శివరాత్రి కానుకగా మార్చ్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి గానూ ముందుగా 6 కోట్ల రెమ్యూనరేషన్ తో 50% లాభం తీసుకునేట్టుగా నిర్మాతలతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడట శర్వా. అయితే సినిమా విడుదలకు ముందే అతనికి నాలుగు కోట్ల రూపాయలు చెల్లించారు. మిగిలిన రెండు కోట్ల రూపాయలకు పోస్ట్-డేటెడ్ చెక్కులు ఇచ్చారట. అయితే ఆ చెక్కులు బౌన్స్ అయ్యాయట. దీంతో శర్వానంద్ నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపినట్లు సమాచారం. చూడాలి మరి ఈ విషయాన్ని హీరో, నిర్మాతలు సామరస్యంగా పరిష్కరించుకుంటారా… లేదంటే లీగల్ గానే ముందుకు వెళ్తారా అనేది.
next post
బిగ్ బాస్-3 : వరుణ్ అంటే ఎవరికీ ఇష్టం ఉండేది కాదు… పునర్నవి వ్యాఖ్యలు