telugu navyamedia
రాజకీయ వార్తలు

ఢిల్లీ పోలీసులు చూస్తూ ఉండిపోయారు: ప్రియాంక గాంధీ

Priyanka

ఢిల్లీలో జామియా విద్యార్థులపై కాల్పులు జరగడం దుమారం రేపుతోంది.ఈ ఘటన పై కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ తీవ్రంగా స్పందించారు. బీజేపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయంటూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయన కోరుకుంటున్నది ఇదేనా? అని ప్రశ్నించారు. జామియా విద్యార్థులు శాంతియుతంగా జరుపుతున్న నిరసనపై కాల్పులు జరుగుతుంటే ఢిల్లీ పోలీసులు చూస్తూ ఉండిపోయారని మండిపడ్డారు. ఈ మేరకు బీజేపీ గాడ్సే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేశారు.

ఎలాంటి ఢిల్లీని తయారుచేయాలనుకుంటున్నారో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని ప్రియాంక డిమాండ్ చేశారు. వారు హింస లేదంటే అహింస వైపు నిలబడతారా? లేక, అభివృద్ధి, ఆందోళన వైపు నిలబడతారా? అని నిలదీశారు. సీఏఏకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారిని కాల్చిపారేయాలంటూ అనురాగ్ ఠాకూర్ ఇటీవల వ్యాఖ్యానించారు.

Related posts