telugu navyamedia
రాజకీయ వార్తలు

మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలకు మల్లికార్జున ఖర్గే పిలుపు!

mallikarjuna kharage

మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఢిల్లీకి రమ్మని పిలిచామని ఆ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు వారితో చర్చించి, మహారాష్ట్రలో అనుసరించాల్సిన వైఖరిపై చర్చిస్తామని తెలిపారు.మహారాష్ట్రలో శివసేనకు మద్దతు ఇచ్చే విషయంపై కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పార్టీతో కలవకూడదని కొందరు నేతలు బలంగా తమ వాదన వినిపిస్తున్నారు.

కాగా, రెండో అతిపెద్ద పార్టీగా శివసేనను ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానించిన గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి.. ఈ రోజు రాత్రి 7.30 లోపు ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని శివసేనకు డెడ్‌లైన్ విధించారు. దీంతో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ తమ తమ పార్టీ నేతలతో కీలక చర్చలు జరుపుతున్నాయి.

Related posts