తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ, సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు నివాసంతో పాటు ఆయన సంస్థల పై ఈ రోజు సీబీఐ దాడులు చేపట్టింది. హైదరాబాద్, గుంటూరు నగరాల్లోని రాయపాటి ఇల్లు, కార్యాలయాలతో పాటు ట్రాన్స్ ట్రాయ్ సంస్థలోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.రాయపాటికి వాటాలు ఉన్న ట్రాన్స్ ట్రాయ్ కి గతంలో పోలవరం కాంట్రాక్టు దక్కిందన్న సంగతి విదితమే.
కొన్ని కారణాలతో ఇతర కంపెనీలకు సబ్ కాంట్రాక్టు ఇచ్చి పోలవరం పనులను ట్రాన్స్ ట్రాయ్ కొనసాగించింది. ఇదే సమయంలో బిజినెస్ పేరిట బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుని, వాటిని తిరిగి చెల్లించడంలో ట్రాన్స్ ట్రాయ్ విఫలమైంది. ఈ విషయమై గతంలోనే సీబీఐ కేసును నమోదు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగానే నేడు దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఏపీలో పార్టీ పెట్టడంపై వైఎస్ షర్మిళ సంచలన వ్యాఖ్యలు..