కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్లో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. మర్కుక్ పంప్హౌస్లో మోటార్లను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. చినజీయర్స్వామితో కలిసి కేసీఆర్ మోటార్లను ప్రారంభించారు. మర్కుక్ పంప్హౌస్ నుంచి కొండపోచమ్మసాగర్లోకి నీటిని ఎత్తి పోసే మోటర్లను ప్రారంభించారు.
సీఎం స్విచ్చాన్ చేసిన వెంటనే గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్లోకి చేరుకున్నాయి. అనంతరం కొండపోచమ్మ కట్టపై గోదావరి నీటికి సీఎం కేసీఆర్ జలహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అక్రమ నిర్మాణంలోనే చంద్రబాబు నివాసం: రామకృష్ణారెడ్డి