ఖమ్మం లో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న నేపథ్యం లో మంత్రి పువ్వాడ అజయ్ పై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.
మంత్రి పువ్వాడ అజయ్ ఓ సైకో.. కేసీఆర్, కేటీఆర్ దగ్గర మార్కులు కొట్టేడానికి పువ్వాడ ఓవర్ యాక్షన్ చేస్తు్న్నారు. పువ్వాడకి కొందరు పోలీసులు చెంచాగిరి చేస్తున్నారు. మూడేళ్లుగా ఖమ్మంలో పోలీసుల వేధింపులు ఎక్కువ అయ్యాయన్నారు.
సీఎం కేసీఆర్ వెంటనే పువ్వాడ ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని, కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.
బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యపై బాధితుల వాంగ్మూలం తీసుకొని ఎమ్మారో, ఆర్డీవో, సీఐ, డీఎస్పీని సస్పెండ్ చేయాలన్నారు.
మూడేళ్లుగా అజయ్ మీద ఉన్న ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని అన్నారు.. కేసీఆర్ ఆలస్యం చేస్తే ప్రభుత్వానికే నష్టం. ఖమ్మంలో ఇంత జరుగుతుంటే ఎస్పీ ఏం చేస్తున్నారు.
మంత్రి ఏది చెబితే అది చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న కొందరు పోలీసుల కారణంగా ప్రజల్లో విశ్వాసం పోతోందని జగ్గారెడ్డి అన్నారు. మంత్రి పువ్వాడకు కొమ్ముకాస్తున్న పోలీసులపై సస్పెండ్ చేస్తేనే ఇతరుల్లో మార్పు వస్తుందని అన్నారు