telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వెంకటేశ్వరస్వామి ఆలయానికి పవన్ భారీ విరాళం

సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ దైవ భక్తి ప్రదర్శిస్తున్నారు. గుంటూరు జిల్లా నంబూరులో ఉన్న దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

ఆలయంలోమొక్కులు తీర్చుకొని, స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన ఆలయానికి భారీ విరాళం ప్రకటించారు. రూ.1.32 కోట్ల విలువైన చెక్ ను ఆలయ ధర్మకర్తలకు స్వయంగా అందజేశారు. స్వామివారి నిత్యాన్నదాన పథకానికి తన విరాళాన్ని ఉపయోగించాల్సిందిగా ఆలయకమిటీ సభ్యులను కోరారు. ఆలయంలో అన్నదానం జరుగుతుండగా భక్తులకు పవన్ స్వయంగా వడ్డించారు. పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, అంజిబాబు, పార్టీ కార్యకర్తలు ఆయన వెంటఉన్నారు.

Related posts