టాలీవుడ్ లో యూత్ స్టార్గా కొనసాగుతున్నాడు హీరో నితిన్. ఈ ఏడాది ప్రారంభంలో భీష్మాతో విజయం అందుకున్నాడు. దాంతో ఎక్కడా ఆగకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం నితిన్, కీర్తీ సురేష్లు జంటగా రంగ్ దే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వెంకీ అల్లూరీ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ తీస్తున్నారు. ఈ సినిమాలో ఈ జంట తొలిసారి కలిసి చేస్తున్నారు. కానీ వీరిద్దరి మధ్య కెమిస్ట్రే బాగానే కుదిరిందని ప్రచార చిత్రాలు తెలుపుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. మరి ఇది ఓటీటీలో విడుదల అవుతుందా లేదా థియేటర్ల కోసం ఆగుతుందా అనేది తెలియాలి. అయితే ఈ సినిమా టీజర్లో వచ్చే ఏడాది సంక్రాంతికి అని ఉంది. కాబట్టి థియేటర్లలో విడుదల కావచ్చు. థియేటర్లు మొదలు కావడానికి మరింత ఆలస్యం పట్టొచ్చని జీ స్టూడియోస్తో ఓటీటీ డీల్ చేసుకుంది. ఈ సంస్థ వారు సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాను థియేటర్లో విడుదాల చేయనున్నట్లు ప్రకటించడంతో నితిన్ సినిమా కూడా థియేటర్లలోనే వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నితిన్ మరో సినిమా చెక్ కూడా ఓటీటీలో విడుదల అవుతుందని టాక్ ఉంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్గా చేస్తున్నారు. ఈ సినిమా భవ్య క్రియేషన్స్ బ్యానర్పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే ఈ బ్యానెర్ నిర్మించి మిడిల్ క్లాస్ మెలొడీస్ సినిమా ఓటీటీలో విడుదలైంది. ఇప్పుడు చెక్ సినిమా కూడా అదే పంథాలో వెళ్లే అవకాశాలు ఉన్నాయని పుకార్లు వస్తున్నాయి.
next post
చరణ్ పై మంచు లక్ష్మీ ఆసక్తికర ట్వీట్