telugu navyamedia
క్రీడలు వార్తలు

రెండో రోజు భారత్ కు షాక్ ఇచ్చిన మోయిన్ అలీ…

ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో నిన్న ఆట ముగిసే సమయానికి 300/6 తో నిలిచిన భారత్ రెండో రోజు ఆట ప్రారంభమైన తర్వాత మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్ 5 పరుగులు చేసి ఔట్ అవ్వగా, ఇషాంత్ శర్మ డక్ ఔట్ అయ్యాడు. అయితే ఒకే ఓవర్లో రెండు వికెట్ తీసి భారత్ కు భారీ షాక్ ఇచ్చాడు మోయిన్ అలీ. దాంతో ప్రస్తుతం 301/8 తో భారత్ నిలిచింది. అయితే నిన్న కూడా ఇలాగె ఆట ప్రారంభమైన తర్వాత కాసేపటికే వరుసగా వికెట్లు కోల్పోయిన భారత్ ను రోహిత్ శర్మ, రహానే క్కలిసి ఆదుకున్నారు. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి సెషన్‌లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్తో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా డకౌట్లుగా వెనుదిరగడంతో జట్టు కష్టాల్లో పడింది. కానీ అప్పుడు వారు ఆదుకున్నారు. కాబట్టి ఈరోజు ప్రస్తుతం క్రీజులో ఉన్న పంత్, కుల్దీప్ కలిసి ఆదుకుంటారా… లేదా అనేది చూడాలి. అయితే పంత్ మాత్రం ప్రస్తుతం హిట్టింగ్ ఆడాలి అని నిర్ణయించుకున్నాడు.

Related posts