telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సీఎం కేసీఆర్‌తో ఎంపీ అసదుద్దీన్‌ సమావేశం

asaduddin owisi

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఈ రోజు భేటీ అయ్యారు. ముస్లిం ఫోరం నాయకులతో కలిసి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో ఒవైసీ సమావేశమయ్యారు. సుమారు 3 గంటలపాటు ఈ సమావేశం జరిగింది. సమావేశమనంతరం ఎంపీ అసదుద్దీన్‌ మీడియాతో మాట్లాడుతూ..ఎన్‌ఆర్సీని వ్యతిరేకించాలని సీఎం కేసీఆర్‌ను కోరినట్టు తెలిపారు.

సీఏఏ, ఎన్‌ఆర్‌సీ అమలు చేయొద్దని సీఎంకు లేఖ సమర్పించాం. రాజకీయ పార్టీలతో సమావేశం అవుతామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. సీఎం కేసీఆర్‌ తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు అసదుద్దీన్‌ చెప్పారు. ఈ నెల 27న నిజామాబాద్‌లో సభ నిర్వహిస్తామని ఎంపీ అసదుద్దీన్ అన్నారు. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్‌, పాషా ఖాద్రీ పాల్గొన్నారు.

Related posts