పశ్చిమాఫ్రికాలోని బుర్కినాఫసో దేశంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మాలి సరిహద్దుకు సమీపంలోని ఆర్బిండా అనే పట్టణంపై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 35 మంది పౌరులు మృతి చెందినట్టు ఆ దేశ అధ్యక్షుడు రోక్ మార్క్ క్రిస్టియన్ కబోర్ ప్రకటించారు.
మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని తెలిపారు. ఈ దాడి ఘటన నేపథ్యంలో రంగంలోకి దిగిన సైన్యం 80 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు వెల్లడించారు. సైన్యం, ఉగ్రవాదులకు మధ్య జరిగిన పోరులో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పారు.