telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ ఎక్కడ నుంచి వచ్చావో గుర్తుపెట్టుకో: చంద్రబాబు వార్నింగ్

Chandrababu fire to CM KCR

తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఎక్కడ నుంచి వచ్చావో గుర్తుపెట్టుకో అంటూ హెచ్చరించారు. తిరుపతిలోని తారకరామ మైదానంలో ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచింది తానేనని చెప్పుకొచ్చారు. హైదరాబాద్, సైబరాబాద్ లో కంపెనీలు తీసుకువచ్చేందుకు ఎన్నో కష్టాలు అనుభవించానని తెలిపారు. తాను చేసిన అభివృద్ధే తప్ప ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చేసిందేమీ లేదన్నారు.

తాను చెట్టు నాటితో పండ్లు మీరు తింటున్నారంటూ వ్యాఖ్యానించారు. అలాంటి తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా అంటూ మండిపడ్డారు. ఉమ్మడి ఆస్తులుకు సంబంధించి లక్ష కోట్లు రావాల్సి ఉండగా తిరిగి తామే ఇవ్వాలంటూ కేసీఆర్ బెదిరిస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మా విద్యుత్ వాడుకుని రూ.5వేల కోట్లు ఇవ్వాల్సింది వాస్తవం కాదా అంటూ చెప్పుకొచ్చారు. కేసీఆర్ నీ బెదిరింపులకు ఎవరు భయపడరని, వేషాలు వేస్తే తగినరీతిలో బుద్ధి చెప్తామని చంద్రబాబు హెచ్చరించారు.

Related posts