చైనా నుంచి డిస్ప్లే యూనిట్ను మరో చోటికి మార్చేస్తున్నట్టు వియత్నాం దినపత్రి ఓ కథనం ప్రచురించింది. ఈ వార్తపై దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ స్పందించింది. శాంసంగ్కు చైనాలో ఉన్న డిస్ప్లే ప్రొడక్షన్ యూనిట్ను వియత్నాంకు మార్చేస్తున్నట్టు ఆ పత్రిక పేర్కొంది.
శాంసంగ్ వియత్నాం వెబ్సైట్లో ఈ మేరకు కంపెనీ పేర్కొందని కథనంలో రాసుకొచ్చింది.ఈ కథనంపై స్పందించిన శాంసంగ్ ఆ దినపత్రిక వార్తను ఖండించింది. చైనా నుంచి తమ డిస్ప్లే యూనిట్ను మరో చోటికి మార్చే ఉద్దేశం ఏదీ తమకు లేదని స్పష్టం చేసింది. ఆ కథనం పూర్తిగా వాస్తవ దూరంగా ఉందని పేర్కొంది.
విద్వేష భావజాలంతోనే మా పోరాటం: రాహుల్