ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ప్రమాణస్వీకారం ఏప్రిల్11న జరగనుంది. కొత్త మంత్రులతో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. ఏపీ రాజభవన్కు 24మంది మంత్రులు రాజీనామాలు చేరుకున్నాయి. ఈ రాత్రికే గవర్నర్ రాజీనామాలు ఆమోదించనున్నారు
2024 ఎన్నికల్లో వైపీసీ గెలుపే లక్ష్యంగా మొత్తం మంత్రులందరితో మూకుమ్మడి రాజీనామాలు చేయించారు. వీరిలో కొందరు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. తొలుత ఐదుగురు మంత్రులు కొనసాగతారని ప్రచారం జరిగింది. తాజాగా 10 నుంచి 15 మంది వరకు కంటిన్యూ అవుతారని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో కొందరు ఆశావహుల పదవి మాకే వస్తుందని ఎదురుచూస్తున్నారు.
అలాగే కొత్త మంత్రులపై సీఎం జగన్ కసరత్తు తుది దశకు చేరింది. కొత్తగా మంత్రి వర్గంలోకి తీసుకునేవారితో పాటు కొనసాగించే వారి పేర్లను కూడా గవర్నర్ వద్దకు పంపనుంది.
ప్రస్తుతం మంత్రులుగా ఉన్న బొత్స , పెద్దిరెడ్డి , కొడాలి నాని , బుగ్గన , పేర్ని నాని , అనిల్ , బాలినేని, కన్నబాబు లను అనుభవం ప్రకారం కొనసాగించే అవకాశం ఉంది.
అలాగే సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంత్రులు జయరామ్, వేణుగోపాల్ , అప్పలరాజు, సురేష్ , అంజాద్ బాషా, శంకర్ నారాయణ , తానేటి వనిత ను కొత్త కేబినెట్లోకి తీసుకుంటారని వైసీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.