telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వలస కూలీలు మృతి

Accident

పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వలస కూలీలు మృతి చెందారు. జిల్లాలోని ఉంగుటూరు మండలం కైకరం వద్ద జాతీయ రహదారిపై ఈ తెల్లవారు జామున ఈ ఘటన చోటుచేసుకొంది. చేబ్రోలు పోలీసుల కథనం ప్రకారం.. ఇద్దరు యువకులు సైకిల్‌పై ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం బయలుదేరారు.

ఈ క్రమంలో కైకరం వద్ద వెనక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం వారి సైకిలును బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తిని తణుకు ఆసుపత్రికి తరలించారు. అతడు కూడా మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. వారి వద్ద ఉన్న వస్తువుల ఆధారంగా వలస కూలీలుగా వారిని గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts