పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వలస కూలీలు మృతి చెందారు. జిల్లాలోని ఉంగుటూరు మండలం కైకరం వద్ద జాతీయ రహదారిపై ఈ తెల్లవారు జామున ఈ ఘటన చోటుచేసుకొంది. చేబ్రోలు పోలీసుల కథనం ప్రకారం.. ఇద్దరు యువకులు సైకిల్పై ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం బయలుదేరారు.
ఈ క్రమంలో కైకరం వద్ద వెనక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం వారి సైకిలును బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తిని తణుకు ఆసుపత్రికి తరలించారు. అతడు కూడా మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. వారి వద్ద ఉన్న వస్తువుల ఆధారంగా వలస కూలీలుగా వారిని గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.