ఏపీలో అన్న క్యాంటిన్ లను ప్రభుత్వ కార్యాలయాలుగా మారచడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అన్న క్యాంటిన్లను ప్రభుత్వ కార్యాలయాలుగా మార్చడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగాన్ని అన్న క్యాంటిన్కు తరలించడంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
గత టీడీపీ ప్రభుత్వంలో ఈ అన్న క్యాంటిన్లలో రోజుకు వేలాదిమంది భోజనాలు చేసేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటిన్లను మూసివేసింది.కొద్ది రోజుల క్రితమే కోర్టుకు ప్రభుత్వ శాఖలు సమర్పించిన నివేదికలో అన్న క్యాంటిన్లు ఎప్పుడు, ఎవరు మూసివేశారో తమకు తెలియదని తెలిపారు. ఇప్పుడు వాటిని గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్న క్యాంటీన్లను మున్సిపల్ శాఖకు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలుగా మార్పు చేశారు.
ఏపీ కేబినేట్ మీటింగ్లో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..