telugu navyamedia
ఆంధ్ర వార్తలు

రేపు ఢిల్లీకి సీఎం జగన్‌..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జగన్‌ భేటీ కానున్నారు.

ఈ సందర్భంగా  రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప‌లు అంశాల‌పై సీఎం జగన్ చ‌ర్చ‌లు జ‌రిపే అవ‌కాశం ఉంది.

అలాగే పోలవరం సహా పెండింగ్ అంశాలపై ఈ సమావేశంలో సీఎం జగన్ చర్చించనున్నట్టుగా తెలుస్తోంది.

కొత్త జిల్లా ఏర్పాటు, త్వరలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరగనున్న నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

 

Related posts