ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జగన్ భేటీ కానున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అంశాలపై సీఎం జగన్ చర్చలు జరిపే అవకాశం ఉంది.
అలాగే పోలవరం సహా పెండింగ్ అంశాలపై ఈ సమావేశంలో సీఎం జగన్ చర్చించనున్నట్టుగా తెలుస్తోంది.
కొత్త జిల్లా ఏర్పాటు, త్వరలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరగనున్న నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
చంద్రబాబుకు అభివృద్ధి గురించి ఏం తెలుసు: మంత్రి బొత్స