telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ఏపీలో కరోనా మహోగ్రరూపం.. 40 వేలు దాటిన కేసులు!

Corona

ఏపీలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ అక్కడ కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 40 వేల మార్కు దాటింది. కొత్తగా 42 మరణాలు సంభవించగా, కరోనా మృతుల సంఖ్య 534కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో మరో 2,602 మందికి పాజిటివ్ అని తేలింది. జిల్లాల వారీగా చూస్తే తూర్పుగోదావరిలో అత్యధికంగా 643 కేసులు నమోదయ్యాయి. అటు, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 40,646కి చేరింది. తాజాగా 837 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 19,814 మంది చికిత్స పొందుతున్నారు.

Related posts