telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఎన్నికల తర్వాత తాను టీడీపీ కార్యకర్తగానే: లోకేష్

Minister Lokesh comments YS Jagan
ఎన్నికల తర్వాత తాను టీడీపీ కార్యకర్తగానే పనిచేస్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ ప్రకటించారు. ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఏ పని చేయాలనే విషయమై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకొంటుందని ఆయన వివరించారు. టీడీపీ విజయం సాధిస్తే 
ఈ సారి కూడా  ఏపీకి చంద్రబాబు  ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆయన తెలిపారు. తాను టీడీపీ కార్యకర్తగా కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రానికి చంద్రబాబు విజన్ రాష్ట్రానికి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. 
ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు సేవలు అవసరమని ఆయన చెప్పారు. పార్టీ ఆదేశాల మేరకు పని చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రాన్ని  బీజేపీ మోసం చేసిందని లోకేష్ విమర్శించారు. గ్రాఫిక్స్‌లో అమరావతిని అభివృద్ధి చేస్తున్నట్టుగా చూపినట్టు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు. కేంద్రంలో మోడీ మరోసారి ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదని లోకేష్  జోస్యం చెప్పారు.

Related posts