ప్రధాని నరేంద్రమోడీ గారడి మాటలకు ఓట్లు పడవని, రాబోయే రోజుల్లో ఆయన గల్లంతవ్వక తప్పదని ఏపీ సీఎం చంద్రబాబు హితవు పలికారు. శ్రీకాకుళం జిల్లా రాజాం మండం పొగిరి గ్రామంలో నిర్వహించిన జన్మభూమి మాఊరు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం జరుగుతున్న పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం ఆనేక సార్లు అడ్డుపడుతోందని ఆరోపించారు.
రాష్ట్రా భివృధ్ధి దృష్టిలో ఉంచుకొని నిర్మాణాన్ని వేగవంతంచేసామని పేర్కొన్నారు. దీంతో పోలవరానికి అవార్డు కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమేనని చంద్రబాబు తెలిపారు. బ్యాంకుల నుంచి వేల కోట్లు దోచుకున్న వారిని విదేశాలకు పంపిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్లో నష్టపోయిన వ్యక్తులకు ఆ ఆస్తులమ్మి నిజాయితీగా అందరికీ డబ్బులు పంపిణీచేస్తామని చంద్రబాబు తెలిపారు.