telugu navyamedia
వార్తలు సామాజిక

కురుస్తున్న భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెల‌వు

rains started today and tomorrow in telangana

త‌మిళ‌నాడు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించి పోయింది. కొన్ని చోట్ల రాకపోకలకు అంటాయ్మేర్పడింది. దీంతో ఈ రోజు ఆరు జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీల‌ను బంద్ చేశారు. తిరున‌వెల్లీ, ట్యూటికోరిన్‌, తేని, విరుదాన‌గ‌ర్‌, వెల్లోర్‌, రామ‌నాథ్‌పురం జిల్లాల్లో విద్యాల‌యాల‌ను మూసివేశారు.

మ‌ధురై జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్‌ను బంద్ చేశారు. త‌మిళ‌నాడులోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే ప్ర‌మాదం ఉంద‌ని భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. ఉరుములు, మెరుపుల‌తో కూడిన జ‌ల్లులు కువ‌నున్నాయి. దీంతో ముందు జాగ్ర‌త్త‌గా పాఠ‌శాల‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టించారు.

Related posts