రాష్టంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన అక్రమాలకు సంబంధించి ‘అవినీతి చక్రవర్తి’ పేరుతో రాసిన పుస్తకాన్ని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ ఆదివారం ప్రజాసంకల్పయాత్రలో విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు ఆయన అనుచరులు 6లక్షల కోట్ల రూపాయలకు పైగా దోచుకున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి నవంబర్ 30వ తేదీ వరకు చంద్రబాబు, టీడీపీ నేతలు చేసిన అవినీతిని, అన్యాయాలను సాక్ష్యాధారాలతో, జీవో నంబర్లతో సహా ఈ పుస్తకంలో పొందుపరిచ్చనట్టు తెలిపారు. అవినీతి చక్రవర్తి పుస్తకాన్ని రాష్ట్రపతికి, ప్రధాన మంత్రికి, ఎంపీలకు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, గవర్నర్లకు, అన్ని దర్యాప్తు సంస్థలకు అందజేయనున్నట్టు వెల్లండించారు. చంద్రబాబు ఏపీకి చేసిన అన్యాయాన్ని దేశ వ్యాప్తంగా తెలియజేయనున్నట్టు పేర్కొన్నారు.
ఓడిపోతానని తెలిసే చంద్రబాబు రాష్ట్రాన్ని అథోగతి పాలు చేశారు: శ్రీకాంత్ రెడ్డి