telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ పై జరిగిన దాడి కేసుపై చంద్రబాబు సమీక్ష

Chandrababu comments Jagan cases

విశాఖపట్నం ఎయిర్ పోర్టులో వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించారు.

కోడికత్తి కేసు హైకోర్టులో విచారణ జరుగుతుండగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం తప్పుపట్టింది. న్యాయపరంగా ఎలా వెళ్ళాలనే దానిపై చంద్రబాబు సమీక్ష జరిపారు. ఈ సమీక్షకు డీజీపీ ఠాకూర్, ఏజీ, పోలీస్ ఉన్నతాధికారులు తదితరులు హారజరయ్యారు.

Related posts