telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అందరు మాస్కులు పెట్టుకుంటే.. జగన్ మాత్రం పెట్టుకోడు..

Tdp Achennaaidu

ఏపీ ప్రభుత్వంపై టిడిపి రాష్ట్ర అద్యక్షుడు అచ్చెన్ననాయుడు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కోవిడ్ అరికట్టడంలో ప్రభత్వం పూర్తిగా విఫలం అయ్యిందని.. ఉత్తరాంద్రలో 46 వేల కేసులు ఉంటే 6 వెంటీలేటర్లు బెడ్లు 44 ఆక్సీజన్ బెడ్లు ఉన్నాయన్నారు..46 వేల మందిలో ఎంత మందిని కాపాడుతారని.. ఆసుపత్రిలో సౌకర్యలు సామర్థ్యం పెంచకుండా తత్సరం చేస్తున్నాయని మండి పడ్డారు. ఏపిని ఆదర్శంగా తీసుకుంటున్నారంటు మంత్రులు సిగ్గుమాలిన మాటలు మాట్లాడతున్నారని.. వాక్సీన్ కు మహరాష్ట్ర, తమిళనాడు, కేరళ గ్లోబల్ టెండర్లు పిలిచాయి…ఆ విషయం మీరు గ్రహించాలన్నారు. జగన కనీసం మాస్క్ పెట్టుకోకుండా ప్రజలు మాస్క్ పెట్టుకోండి సహజీవనం చేయ్యమంటావా.. అందరు మాస్కులు పెట్టుకుంటే జగన్ మాత్రం పెట్టుకోడని చురకలు అంటించారు. జగన్ లేఖ రాయడం వల్లే విదేశీ టీకాలు వస్తున్నాయి అంటు డబ్బా కొట్టుకుంటున్నారు…మీకంటే ముందే కేజ్రీ వాల్ లేఖ రాసారని చురకలు అంటించారు… అబద్దాల ముఖ్యమంత్రి రాష్ట్రన్ని పాలిస్తున్నాడు… ఇతర రాష్ట్రాల్లో 40 పేజీలతో హెల్త్ బులిటెన్ ఇస్తుంటే..ఈ ప్రభుత్వం 1 పేజీ ఇస్తు మరణాలును దాస్తుందని ఫైర్ అయ్యారు… మెుదటి టీకాలు వేసుకుంటు రాష్టాలు ముందుంటే మన రాష్ట్రం 25 స్థానంలో ఉందన్నారు. నా పర్సనాలటీ గురించి కన్నాబాబు, ఆళ్ళనాని మాట్లడుతాడు ఎం చేసిన నా పర్సనాలటీ రాదని ఎద్దేవా చేశారు.

Related posts