telugu navyamedia
రాజకీయ సినిమా వార్తలు

నా పగ తీరింది… జగన్ పై శ్రీరెడ్డి పోస్ట్

Srireddy Post on Jagan Mohan Reddy

ఓట్ల లెక్కింపు నేపథ్యంలో వైసీపీ ప్రభంజనంతో సినీ నటి శ్రీరెడ్డి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. వైసీపీ గెలుపుపై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. ”నా పగని, పంతాన్ని తీర్చిన అందరికి నా సాష్టాంగ నమస్కారం. నేను రియల్ దేవసేన.. రియల్ బాహుబలి వన్ అండ్ ఓన్లీ జగన్” అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ కి బాహుబలి అనుష్క పక్కన తన ఫోటోని పెట్టుకొని షేర్ చేసింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు లోకసభతో పాటు ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11వ తేదీన రాష్ట్రంలోని 175 స్థానాలకు పోలింగ్ జరిగింది. చాలాకాలం నుంచి శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా జగన్ కు తన సపోర్ట్ ను తెలియజేస్తున్న విషయం తెల్సిందే. 

Related posts