జయాపజయాలకు అతీతంగా విక్రమ్ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు విక్రమ్ కథానాయకుడిగా చీకటి రాజ్యం ఫేమ్ రాజేశ్ ఎం.సెల్వ తెరకెక్కించిన చిత్రం “కదరం కొండన్”. ఈ చిత్రాన్ని తెలుగులో “మిస్టర్ కెకె”గా అనువదిస్తున్నారు. ఈ సినిమా జూలైలో సిని విడుదలవుతుంది. కమల్ హాసన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కమల్ రెండో కుమార్తె అక్షర హాసన్ హీరోయిన్గా కీలక పాత్రలో నటించింది. ఇటీవలే ఈ సినిమా తమిళ ట్రైలర్ను కమల్ హాసన్ ట్విట్టర్ లో విడుదల చేయగా, తెలుగు ట్రైలర్ను అక్షర హాసన్ విడుదల చేశారు. అక్షరహాసన్ తన భర్తతో నివసిస్తుంటుంది. గర్భవతిగా ఉన్న ఆమెను ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఆమె భర్తను బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. మరో పక్క విక్రమ్ అండర్ కవర్ ఆపరేషన్లో ఉండే కమెండో, డబుల్ ఏజెంట్గా మారిన వ్యక్తి అని తెలుస్తుంది. అతని పేరు కె.కె అని ట్రైలర్లో తెలియజేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. జూలై 19న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషలలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానులలో భారీ ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. ప్రస్తుతం విక్రమ్ మలమాళం, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతున్న పౌరాణిక చిత్రం మహావీర్ కర్ణలో నటిస్తున్నారు. త్వరలో అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు.
previous post
next post
పెళ్ళికి నన్ను పిలవలేదు… మాజీ ప్రేయసిపై హీరో కామెంట్స్