telugu navyamedia
రాజకీయ వార్తలు

మోదీ కొత్తగా ఏం చెప్పారో అర్థం కాలేదు: చిదంబరం

congress chidambaram

ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో కొత్తగా ఏం చెప్పారో తనకు అర్థం కాలేదని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీ. చిదంబరం అన్నారు. కరోనా కట్టడికి లాక్ డౌన్ కొనసాగించడం ఒక్కటే మార్గమన్న విషయం అందరికీ తెలిసిందేనని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు పెట్టిన ఆయన, లాక్ డౌన్ పొడిగింపును తాను సమర్థిస్తున్నానని పేర్కొన్నారు.

నిరాశ్రయులై, రోడ్డున పడ్డ పేదల గురించి కేంద్రం పట్టించుకోవడం లేదని మరోసారి స్పష్టమైందని విమర్శలు గుప్పించారు.”లాక్‌ డౌన్‌ కొనసాగింపును పక్కన పెడితే… ప్రధాని నూతన సంవత్సర సందేశంలో కొత్త అంశం ఏముంది?. పేదల జీవనం, వాళ్ల మనుగడకి ప్రాధాన్యత లేదని మరోసారి రుజువైంది” అని చిదంబరం విమర్శించారు.

ముఖ్యమంత్రులు కోరిన ఆర్థిక సహాయం గురించి నరేంద్ర మోదీ నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదని తెలిపారు. మార్చి 25న ప్రకటించిన ప్యాకేజీకి ఒక్క రూపాయి జత చేయలేదు. రఘురామ్ రాజన్ నుంచి జీన్ డ్రేజ్ వరకూ, ప్రభాత్ పట్నాయక్ నుంచి అభిజిత్ బెనర్జీ ఇచ్చిన సలహాలు, చెవిటి వాని ముందు శంఖం ఊదినట్టు అయిందన్నారు.

Related posts