telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత్‌తో ఆడే వన్డేలకు న్యూజిలాండ్‌ జట్టును ప్రకటించిన సెలక్టర్లు

southi cricketer newsziland

భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య మూడు వన్డేల సిరీస్‌ ఫిబ్రవరి 5 నుంచి హామిల్టన్‌ వేదికగా ఆరంభంకానుంది. 14 మంది ఆటగాళ్లతో కూడిన వన్డే జట్టును న్యూజిలాండ్‌ సెలక్టర్లు ఈరోజు ప్రకటించారు. కైల్‌ జామిసన్‌ పరిమిత ఓవర్ల క్రికెట్లోకి అరంగేట్రం చేయనుండగా.. స్కాట్‌ కుగెలిన్‌, హమీష్‌ బెనెట్‌ చాలా రోజుల తర్వాత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు.

ట్రెంట్‌ బౌల్ట్‌, లాకీ ఫర్గుసన్‌, మాట్‌ హెన్రీ గాయాలతో సిరీస్‌కు దూరమయ్యారు. టీమ్‌ సౌథీ పేస్‌ భారాన్ని మోయనున్నాడు. ఆఖరి రెండు టీ20లకు జట్టులో లేని గ్రాండ్‌హోం వన్డే టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు. జిమ్నీ నీషమ్‌, మిచెల్‌ సాంట్నర్‌ ఆల్‌రౌండ్‌ కోటాలో బరిలో దిగనున్నారు. ఇష్‌ సోధీని కేవలం తొలి వన్డే కోసం మాత్రమే ఎంపిక చేశారు. ఐదు టీ20ల సిరీస్‌లో భారత్‌ 3-0తో సిరీస్‌ను చేజిక్కించుకుంది.

వన్డే జట్టు: కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), హమీశ్‌ బెనెట్‌, టామ్‌ బ్లండెల్‌, కోలిన్‌ గ్రాండ్‌హోం, మార్టిన్‌ గప్తిల్‌, కైల్‌ జామీసన్‌, స్కాట్‌ కుగెలిన్‌, టామ్‌ లాథమ్‌, జిమ్మీ నీషమ్‌, హెన్రీ నికోల్స్‌, మిచెల్‌ సాంట్నర్‌, ఇష్‌ సోధీ, టిమ్‌ సౌథీ, రాస్‌ టేలర్‌

Related posts