ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి నిన్న ప్రసంగించిన సంగతి తెలిసిందే. నిన్నటి ప్రధాని ప్రసంగంపై మాజీ ఆర్థిక శాఖ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీ చిదంబరం ఆసక్తికర ట్వీట్ చేశారు. తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఓ వార్తకు సంబంధించిన హెడ్డింగ్ ను మాత్రమే చెప్పారని, దానికింద మాత్రం ఖాళీగా కనిపించేలా చేశారని చిదంబరం విమర్శలు గుప్పించారు.
జీడీపీలో 10 శాతానికి సమానమైన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని సిద్ధం చేస్తున్నామని మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. “ఓ హెడ్ లైన్ పెట్టి, పేజీని ఖాళీగా వదిలేసిన మోదీ, దాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి చేస్తారని చెప్పారు. నేను దాని కోసమే చూస్తున్నాను” అని పేర్కొన్నారు.