telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

వేట కొడవళ్ళతో నరికి టీడీపీ నేత దారుణ హత్య

Manjula

కర్నూలు జిల్లా బనగానిపల్లె నియోజకవర్గంలోని కొలిమిగండ్ల మండలం చింతలాయపల్లెలో టీడీపీ నేత మంజుల సుబ్బారావు దారుణ హత్యకు గురయ్యాడు. మంజుల సుబ్బారావు బనగానిపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు. ఎన్నికల సమయంలో కూడా కీలకంగా వ్యవహరించారు. ఇటు ఈ ఘటనపై బీసీ జనార్ధన్‌రెడ్డి స్పందించారు. ఇలా కార్యకర్తల్ని చంపడం పిరికిపందల చర్యని.. ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలని.. ఇలా మనుషుల్ని చంపడం దుర్మార్గమని మండిపడ్డారు. సుబ్బారావు తన స్కార్పియో వాహనంలో వెళుతుండగా.. మార్గ మధ్యలో దుండుగులు దారి కాచారు. స్కార్పియోను అడ్డగించి.. లోపల ఉన్న సుబ్బారావును బయటకు లాగారు. వేట కొడవళ్లతో నరికి.. రాళ్లతో మోది కిరాతకంగా దాడి చేశారు దుండగుల దాడిలో సుబ్బారావు అక్కడికక్కడే చనిపోగా.. దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యకేసు నమోదు చేసి.. సుబ్బారావు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ హత్య గ్రామంలోని ప్రత్యర్థుల పనిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు స్థానికుల్ని అడిగి మరిన్ని వివరాలు ఆరా తీస్తున్నారు.

Related posts