telugu navyamedia
సామాజిక

విశాఖ సాగ‌ర తీరంలో ఘ‌నంగా ఛ‌ఠ్ పూజ‌లు..

విశాఖ ప‌ట్నం సాగర తీరం లో బీహార్, యూపీ, జార్ఖండ్‌ రాష్ట్రానికి కి చెందిన మహిళలు, కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ద లతో ఛ‌ఠ్ పూజను ఘనంగా నిర్వహించారు. 36 గంటల ముందునుంచి కఠిన ఉపావాస దీక్షలు నిర్వహించి బుధ‌వారం సాయంత్రం , గురువారం ఉదయం ఛ‌ఠ్‌ పూజ పేరుతో సూర్య నికి పూజలు చేసారు.

ఈ ఛ‌ఠ్ పూజ ను భక్తి శ్రద్ధ లతో నిర్వహిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని బీహారీలా నమ్మకం. ఈ పూజా లో చెరుకు గెడలు, వివిధ రకాల ఫలాలు, ఇంట్లో స్వయంగా తయారు చేసిన పిండి వంటలు , బియ్య‌పై చాట‌లో అన్నీ నైవేద్య‌లు పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమం లో నగర ప్రముఖులు జెటికో డి కె వి ఇండియా ప్రవేట్ లిమిటెడ్ మేనేజంగ్ డైరెక్టర్ డాక్టర్ దినేష్ కుమార్, వీణా సింగ్, అర్చన కుమారి, పోర్టు ఉద్యోగులు సుధీర్, రేఖా గుప్తా లతో పాటు విశాఖ నగరం లోని 50చట్ సమితులకు చెందిన వేలాది భక్తులు పాల్గున్నారు..

Related posts