telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణిపై అరెస్ట్ వారెంట్..

నగిరి ఎమ్మెల్యే రోజా భర్త ఆర్కే సెల్వమణిపై అరెస్టు వారెంట్ జారీ అయింది. పరువునష్టం కేసులో సెల్వమణి విచారణకు హాజరుకాకపోవడం వల్ల చెన్నైలోని జార్జి టౌన్ కోర్టు వారెంట్ జారీ చేసింది. ప్రముఖ సినీ దర్శకుడైన ఆర్కే సెల్వమణి ప్రస్తుతం దక్షిణభారత చలనచిత్ర కార్మిక సంఘాల సమ్మేళనం అధ్యక్షుడిగా ఉన్నారు.

2016లో సెల్వమణితో పాటు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరుళ్ అన్పరసు ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా.. అందులో ఫైనాన్షియర్ ముకుంద్ చంద్ బోద్రాపైఅనుచిత వ్యాఖ్యలు చేశారు. అవి బోద్రా ప్రతిష్ఠకు భంగం కలిగించాయనే అభిప్రాయంతో ఆయన వారు ఇద్దరిపై చెన్నై జార్జిటౌన్‌ కోర్టులో పరువునష్టం దావా వేశారు.

అయితే కేసు వేసిన బోద్రా కొంతకాలం క్రితం మరణించారు. ఆయన కుమారుడు గగన్ బోద్రా ఈ కేసును కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈనెల 5వ తేదీన కోర్టు వాయిదా ఉన్నా సెల్వమణి, అన్బరసు కోర్టుకు హాజరుకాలేదు. దీంతో న్యాయమూర్తి వారిద్దరిపై బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీచేస్తూ విచారణను ఈ నెల 23కు వాయిదా వేశారు.

Related posts