telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఏపీ శాసన మండలి చైర్మన్‌ ఎన్నిక ఏకగ్రీవం

AP MLC chairmen Election Unanimous
ఆంధ్రప్రదేశ్  శాసన మండలి చైర్మన్‌ గా ప్రభుత్వ విప్‌ ఎం.ఎ.షరీఫ్‌  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవి కోసం ఒకే ఒక్క నామినేషన్‌దాఖలు కావడంతో షరీఫ్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి ఇన్‌చార్జి చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం  గురువారం ప్రకటించారు. అనంతరం సీఎం చంద్రబాబు, ఇతర నేతల సమక్షంలో షరీఫ్‌ బాధ్యతలు స్వీకరించారు. 
ఈ సందర్భంగా  చంద్రబాబు మాట్లాడుతూ ఫరూక్‌ను మంత్రిగా, షరీఫ్‌ను చైర్మన్‌గా నియమించి మైనార్టీలకు రెండు కీలక పదవులు అప్పగించామని చెప్పారు. షరీఫ్‌ ఆధ్వర్యంలో మండలిలో వ్యవహారాలు సజావుగా సాగాలని ఆకాంక్షించారు.మండలి చైర్మన్‌ షరీఫ్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపారు.

Related posts