telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సీఎం జ‌గ‌న్‌కి ఏపీ ఉద్యోగుల బిక్ షాక్‌..

అమ‌రావ‌తి..పీఆర్సీపై జగన్‌ సర్కార్‌ కు ఉద్యోగ సంఘాలు ఝ‌ల‌క్ ఇచ్చాయి. పీఆర్సీ పై ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల డెడ్ లైన్ విధించింది. ఈ నెలాఖరులోగా పీఆర్సీ ప్రకటించాలని ఉద్యోగ సంఘాల డిమాండ్ చేశాయి. ఏపీ ప్రభుత్వానికి ఈ నెలాఖరు వరకు సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని…ఈ నెల 27 లోపు అన్ని సంఘాల సమావేశాలు నిర్వహిస్తామని ఏపీజేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు. ద‌రిమిల సీఎస్ ను కలిసి త‌మ‌ భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామ‌న్నారు.

తాము దాచుకున్న డబ్బులు కూడా త‌మ‌కు ఇవ్వడం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పీఆర్సీ నివేదిక పై సీఎస్ హామీకే విలువలేదని… ఈ నెలాఖరు లోగా పీఆర్సీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అధికారంలోకి వస్తే..వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీ అమలు చేయలేదని… జగన్ ప్రభుత్వానికి 151 సీట్లు రావడం లో ఉద్యోగుల భాగస్వామ్యం ఉందన్నారు.

ఈ ప్రభుత్వానికి ఉద్యోగుల ఓట్లు అవసరం లేదా? పీఆర్సీ నివేదిక శుక్రవారం ఇస్తామన్న ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. తమకు రావాల్సిన బకాయిలు మార్చి నాటికి క్లియర్ చేస్తామని చెప్పారని… అందుకే నిన్నటి సమావేశం బాయ్ కాట్ చేశామని ఆయన వెల్లడించారు. మా రెండు జేఏసీల ఆధ్వర్యంలో 200 సంఘాలున్నాయని..మా సంఘాలన్నీ క్రింది స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు.

Related posts