telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న టీడీపీ ఎమ్మెల్యే…

ప్రస్తుతం అందరూ కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రలో ట్రయల్స్ జరుగుతున్నాయి. విజయవాడలోని అమరావతి రోడ్డులో ఉన్న జ్వరాల హాస్పటల్ లో భారత్ బయోటెక్ కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. వాలంటీర్ గా రెండవ విడతగా వ్యాక్సిన్ వేయిచుకునేందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు,ఆయన భార్య గద్దె అనూరాధలు వచ్చి వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుండి అవినీతి పై అనేక ప్రకటనలు చేస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పేదానికి చేసే దానికి పొంతన లేకుండా పోయిందని అన్నారు. ప్రాంతాలు,మతాల మద్య చిచ్చు ప్రయత్నం ప్రభుత్వం చేయడం దురదృష్టకరమన్న ఆయన ఒక్క సారి ఇలాంటి వివాదాలు వస్తే వాటిని ఆపడం ఎవరి వల్లా కాదని అన్నారు. రాజకీయ లబ్ది కోసం ప్రాంతాలు,కులాల మధ్య చిచ్చు పెడుతున్నారన్న ఆయన అభివృద్ధి కంటే వివాదాస్పద కార్యక్రమాలకు ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనపిస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పేకాట శిభిరాలు,దాడులు జరుగుతున్నాయని, గుడివాడ,రేపల్లె లో పేకాట శిబిరాల  పై పెద్ద ఎత్తున దాడులు జరిగాయని అన్నారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాల పై ఉక్కు పాదం మోపిన ఘనత ఎన్టిఆర్, చంద్రబాబు కు ఉందని అన్నారు. అలా చేయడం వలన అభివృద్ధి పై దృష్టి కేంద్రీకృతమౌతుందని అన్నారు

Related posts