telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీ ప్రభుత్వం రోజుకు 500 కోట్లు ఖర్చు చేస్తుంది…

manoher nadendla

రోజుకు 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వైసీపీ ప్రభుత్వాన్ని నడుపుతుంది అని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేన క్రియాశీలక సభ్యుల సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నాదెండ్ల మనోహర్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇసుక, మద్యం, సిమెంట్ లో సంపాదిస్తున్న డబ్బు ఏమవుతోంది? 14 నెలల క్రితం నోటిఫికేషన్ ఇచ్చి.. 96 శాతం గెలిచామని వైకాపా నాయకులు చెప్పుకుంటున్నారని ఫైర్‌ అయ్యారు.  రీనోటిఫికేషన్ ఇచ్చి పోలీస్, వాలంటీర్ వ్యవస్థలను వాడకుంటే గెలిచేవారా? ఒక కులాన్ని లక్ష్యం చేసుకుని మా పార్టీ కార్యకర్తలపై దౌర్జన్యాలకు దిగారని మండిపడ్డారు.  జనసైనికులు పోరాడి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారని… కేంద్రం ఇచ్చిన అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లను వైకాపా ప్రభుత్వం ఎందుకు అమలు చేయటం లేదు? అని నిలదీశారు.  కాబోయే సీఎంగా పవన్ కల్యాణ్ ను సోము వీర్రాజు సంబోధిచటం పార్టీకి ఉన్న బలమని..  తిరుపతిలో భాజపా పోటీ చేయటంపై కొద్దిమంది జన సైనికుల్లో ఆవేదన ఉందన్నారు.   రత్న ప్రభ… మిగిలిన పార్టీ అభ్యర్థులతో పోల్చితే మెరుగైన అభ్యర్థి అని… ఆమె విజయం కోసం జన సైనికులు కృషి చేయాలని కోరారు.   జనసేన సంస్థాగతంగా ఇంకా బలోపేతం కావాలని తెలిపారు.  

Related posts