telugu navyamedia
సినిమా వార్తలు

శిల్పాశెట్టి మరియు ఆమె తల్లిపై చీటింగ్‌ కేసు

పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా శిల్పాశెట్టి మరియు ఆమె తల్లి సునందపై లక్నోలోని రెండు పోలీసు స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదైంది. శిల్పా, ఆమె తల్లి తమ వద్ద కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారంటూ జ్యోత్స్న చౌహాన్, రోహిత్ వీర్ సింగ్ అనే ఇద్దరూ హజరత్‌గంజ్‌, విభూతిఖండ్‌ పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు రెండు బృందాలుగా ఎర్పడి విచారణ చేపట్టారు. ఈ రెండు బృందాలకు డీసీపీ సంజీవ్‌ సుమన్‌ అధికారిగా ఉన్నారు. ఇప్పటికే శిల్పాను, ఆమె తల్లిని విచారించేందుకు డీసీపీ, ఒక బృందం ముంబైకు చేరుకుంది.

పోలీసుల సమాచారం ప్రకారం.. శిల్పాశెట్టి అయోసిస్‌ వెల్‌నెస్‌ అండ్‌ స్పా పేరుతో ఫిటినెస్‌ సెంటర్‌ను నడిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ఆమె చైర్మన్‌గా ఉండగా, ఆమె తల్లి సునంద డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఫిట్‌నెస్‌ సెంటర్‌ మరో బ్రాంచ్‌ను లక్నోలో ప్రారంభించేందుకు జ్యోత్స్న చౌహాన్‌, రోహిత్‌ వీర్‌ సింగ్‌ అనే ఇద్దరికి వారు ఫ్రాంచెజ్‌ ఇచ్చి, సెంటర్‌ను ప్రారంభించేందుకు వారి నుంచి కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఆ తర్వాత దీనిపై వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో శిల్పా, ఆమె తల్లి సునందలు తమ వద్ద డబ్బులు తీసుకుని మోసం​ చేశారంటూ పోలీసులను ఆశ్రయించారు.

Related posts