telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మిస్ మ్యాచ్ : “నీ మ‌న‌సే .. సేసే” రీమిక్స్ కోసం 120 గంటలు రిహార్స‌ల్స్

MIss-Match

అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం “మిస్ మ్యాచ్”. ఉదయ్ శంకర్, ఐశ్వ‌ర్యా రాజేశ్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. నిర్మ‌ల్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 6న విడుద‌ల కానుంది. కాగా… ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన “తొలి ప్రేమ” చిత్రంలో “నీ మ‌న‌సే… సేసే” అనే సాంగ్ యూత్ హృద‌యాలని ఎంత‌గా క‌ట్టిప‌డేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పుడు ఇదే సాంగ్‌ని మిస్ మ్యాచ్ సినిమా కోసం రీమేక్ చేశారు. అంతేకాదు ప‌వ‌న్ చేతుల మీదుగా ఈ సాంగ్‌ని విడుద‌ల చేయించారు. చిత్ర బృందం ప‌నితీరు త‌న‌కెంతో న‌చ్చింద‌ని ప‌వ‌న్ ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. అయితే నాలుగున్న‌ర నిమిషాల సాంగ్ కోసం హీరో ఉద‌య్ శంక‌ర్, హీరోయిన్ ఐశ్వ‌ర్యా రాజేష్‌తో పాటు టెక్నీషియ‌న్స్ ఎంత క‌ష్ట‌ప‌డ్డారో వీడియో ద్వారా తెలియ‌జేశారు మేక‌ర్స్‌. 60 మంది డ్యాన్స‌ర్స్‌, 200 మంది టెక్నీషియ‌న్స్ “నీ మ‌న‌సే… సేసే” సాంగ్ కోసం 120 గంట‌ల పాటు రిహార్స‌ల్స్ చేశారు. సాంగ్ అద్భుతంగా రావ‌డంతో చిత్ర‌బృందం చాలా సంతోషంగా ఉంది.

Related posts