telugu navyamedia
సినిమా వార్తలు

కంగనా క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదట… జర్నలిస్టులు ఫైర్

Kangana

కంగనా రనౌత్‌, రాజ్‌కుమార్‌ రావ్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం “జడ్జిమెంటల్‌ హై క్యా”. ప్రకాశ్‌ కోవెలమూడి దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక మర్డర్ మిస్టరీ నేపధ్యంలో కథ సాగుతున్నట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఆ మర్డర్ కంగనా, రాజ్ కుమార్ రావులలో ఎవరో ఒకరు చేశారని పోలీసులు అనుమానిస్తుంటారు. కొద్దిగా మతిస్థిమితం లేని బాబీ అనే పాత్రలో కంగనా మంచి నటన కనబరిచింది. రాజ్ కుమార్ రావు.. కేశవ్ అనే పాత్రలో కనిపించనున్నారు. ఆదివారం `జ‌డ్జ్‌మెంటల్ హై క్యా` ప్ర‌మోష‌న‌ల్ మీట్ జ‌రిగింది. ఇందులో కంగ‌నా త‌న “మ‌ణిక‌ర్ణిక‌” సినిమాను త‌క్కువ చేసి రాశావంటూ ఓ జ‌ర్న‌లిస్టుపై తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. ఈ వ్య‌వ‌హారంపై జ‌ర్న‌లిస్ట్ గిల్డ్ సీరియ‌స్ అయ్యింది. కంగ‌నా సారీ చెప్ప‌క‌పోతే ఆమెకు సంబంధించిన ఏ ప్రోగ్రామ్‌ను క‌వ‌ర్ చేయ‌మ‌ని తెలియ‌జేసింది. విష‌యం సీరియ‌స్‌గా మార‌డంతో “జ‌డ్జ్‌మెంట‌ల్ హై క్యా” నిర్మాత ఏక్తాక‌పూర్ జ‌ర్న‌లిస్టుల‌ను క్ష‌మాప‌ణ కోరుతూ ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. అయితే కంగ‌నా సోద‌రి రంగోలి మాత్రం కంగనా సారీ చెప్ప‌దంటూ, ఆమెను క్ష‌మాప‌ణ‌లు అడిగే అర్హ‌త మీకు లేదంటూ రివ‌ర్స్‌గా మాట్లాడింది. ప‌లువురు నెటిజ‌న్స్ కంగనా, రంగోలి ప్ర‌వ‌ర్త‌న బాలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నెల 26న “జ‌డ్జ్‌మెంట‌ల్ హై క్యా” విడుద‌ల‌వుతుంది.

Related posts