telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేడు తిరుపతిలో చంద్రబాబు ర్యాలీ..టీడీపీ నేతల గృహ నిర్బంధం!

chandrababu

ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు తిరుపతిలో జెయేసీ ర్యాలీని తలపెట్టింది. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. అయితే, ర్యాలీకి పోలీసులు అనుమతిని నిరాకరించారు. పండుగ సీజన్ కావడంతో అనుమతిని నిరాకరిస్తున్నట్టు తిరుపతి అర్బన్ ఎస్పీ తెలిపారు.

చంద్రబాబు తిరుపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలను చేపట్టారు. చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ ఛైర్మన్ నరసింహయాదవ్, ఐతేపల్లిలో మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు.

షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు మధ్యాహ్నం 12.45 గంటలకు హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి రేణిగుంటకు బయల్దేరుతారు. 2.10 గంటలకు రేణిగుంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా తిరపతిలోని పూలే విగ్రహం వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి నాలుగు కాళ్ల మంటపం వరకు అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగే ర్యాలీలో పాల్గొననున్నారు.

Related posts