ప్రస్తుతంపూరీ జగన్నాథ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా రేంజ్లో లైగర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే పూరీ గురించి ఓ ఆసక్తికర విషయం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం పూరీ తన తదుపరి సినిమా కోసం మాస్ మహరాజా రవితేజను సంప్రదించారంట. వీరి కాంబో.. ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలతో భారీ హిట్లు అందుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు వీరిద్దరు కలిసి పనిచేసేందుకు చూస్తున్నారు. అయితే రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం వీరిద్దరు హిట్ ట్రాక్లోనే ఉన్నారు. పూరీ గత సినిమా ఇస్మార్ట్ శంకర్ భారీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక రవితేజ క్రాక్ సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్ మహరాజ అభిమానులు వీరి కాంబో కోసం ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది అనేది.
previous post
next post
బీజేపీ నేతలకు ఎన్నికలప్పుడే రాముడు గుర్తొస్తాడు: ఎంపీ కవిత