ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. సీఏఏ, ఎన్నార్సీలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్న ఒవైసీ మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు.
ఒవైసీని దేశంలో పర్యటించకుండా ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. గుంటూరులో ఒవైసీ పర్యటనకు ఓ వైసీపీ ఎమ్మెల్యే నిధులు సమకూర్చారని కన్నా ఆరోపించారు. సీఏఏ వ్యతిరేక కార్యక్రమాల్లో వైసీపీ కూడా పాల్గొనడం సిగ్గుచేటని అన్నారు.