telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్‌ దగ్గర జగన్‌ కూలి పని: చంద్రబాబు

CM Chandrababu fire to CEC
కేసీఆర్‌ దగ్గర జగన్‌ కూలికి పని చేస్తున్నాడని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. బుధవారం ఉదయగిరిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయంత్రానికి జగన్‌ లోటస్‌పాండ్‌కి వెళ్లాలి.. అక్కడ కేసీఆర్‌కి రిపోర్ట్‌ ఇస్తే.. జగన్‌కు ఆయన డబ్బులిస్తారని చెప్పారు. వైసీపీ అధినేత జగన్‌, తెలంగాణ  సీఎం కేసీఆర్‌ ఇద్దరు కలిసి ప్రజల్ని మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 
కేసీఆర్‌కి ఊడిగం చేయడానికి జగన్‌ సిద్ధపడ్డాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రత్యేక హోదాకు అభ్యంతరం లేదని కేసీఆర్‌తో మేనిఫెస్టోలో పెట్టించాలని డిమాండ్ చేశారు. జగన్‌, మోదీ, కేసీఆర్‌ ఎప్పుడూ నిజం చెప్పి ఎరుగరని ఆరోపించారు. జగన్‌ 31 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని తెలిపారు. జగన్‌ వల్ల ఐఏఎస్‌ అధికారులు జైలుకి వెళ్లారని గుర్తుచేశారు. 9 ఏళ్లు సీఎంగా ఉన్నా తన వల్ల ఏ అధికారి ఇబ్బంది పడలేదన్నారు. 

Related posts