తెలంగాణ సీఎం కేసీఆర్ పై కేంద్ర మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ మండిపడ్డారు. కేసీఆర్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని దత్తాత్రేయ ధ్వజమెత్తారు. ఇన్ని రోజులు మోదీ విధానాలను సమర్ధించి ఇప్పుడు విమర్శించడమేంటి? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీపై కేసీఆర్ వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదన్నారు. కేసీఆర్ మోదీకి బేషరతుగా క్షమాపణ చెప్పాలని దత్తన్న డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కేసీఆర్ కుటుంబానికి గులాం గిరి చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ మంత్రులంతా గజగజ వణికిపోతున్నారని ఆరోపించారు. ఫెడరల్ ఫ్రంట్కు నామరూపాలు లేవన్నారు. మోదీ మళ్లీ ప్రధాని అయితే కేసీఆర్, కేటీఆర్ రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రేడినా ? అడిగారు. కేసీఆర్ మాటలు అరిగిపోయిన రికార్డర్ లాగే ఉన్నాయని ఎద్దేవా చేశారు.