telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైద్య సిబ్బందికి భరోసా కల్పించండి: చంద్రబాబు

chandrababu

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి బాధితులకు సేవలందిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అలాంటి వైద్య సిబ్బందికి భరోసా కల్పించే రక్షణ పరికరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకోసం ఎంత మొత్తమైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని కోరారు.

వైద్యుల ఆరోగ్య పరిరక్షణకు తగిన పరికరాలు సరఫరా చేయాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వంపై ఉందని చంద్రబాబు సీఎం జగన్‌ ను కోరారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆయన సూచనలు చేశారు. అనంతపురం జిల్లాలో కరోనా పాజిటివ్‌తో చనిపోయిన 64 ఏళ్ల వృద్ధుడికి చికిత్స అందించిన ఇద్దరు వైద్యులు, నలుగురు సిబ్బందికి పాజిటివ్‌ వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Related posts