telugu navyamedia
ఆంధ్ర వార్తలు

చంద్రబాబును 2024లో రాజకీయ సమాధి చేస్తా – ప్లీనరీలో కొడాలి నాని ఫైర్

ముఖ్యమంత్రి జగన్ ను సీఎం కుర్చీ నుంచి దించాలని నలుగురు ప్రయత్నిస్తున్నారని కొడాలి నాని అన్నారు. ఈ 420 గాళ్లు కి గురువు రామోజీరావు అని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు.

వైసీపీ ప్లీనరీ‌లో ఎల్లో మీడియా- దుష్ట చతుష్టయం తీర్మానంపై చర్చ సందర్భంగా కొడాలి నాని మాట్లాడారు. సీఎం జగన్‌ను దించాలని ఆ నలుగురు కంకణ కట్టుకున్నారు. నలుగురు దొంగల ముఠాగా ఏర్పడి రాష్ట్రాన్ని దోచుకున్నారని కొడాలి నాని నిప్పులు చెరిగారు. ఉదయం నుంచి రాత్రి వరకు దుష్ప్రచారం చేయడమే వీరి పని. ఈ 420 గాళ్లకు ఎవరూ భయపడరని కొడాలి నాని అన్నారు.

ఉదయం నుంచి రాత్రి వరకూ దుష్ప్రచారం చేయడమే వీరి పని అని చెప్పారు. చంద్రబాబును సీఎంగా చేయాలని రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ 5 నాయుడు కంకణం కట్టుకున్నారని చెప్పారు. వీరికి ఎవరూ భయపడే ప్రసక్తి లేదని చెప్పారు

ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనినీ విమర్శించడమే వీరు ధ్యేయంగా పెట్టుకున్నారని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు ఎప్పుడైనా జగన్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు అమలు చేశారా? అని ప్రశ్నించారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత 95 శాతం హామీలను అమలు చేసిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. పేదల కోసం జగన్ నిత్యం పరితపిస్తూనే ఉంటారని, చంద్రబాబు లాంటి చవట దద్దమ్మ దేశంలోనే ఎవరూ లేరని కొడాలి నాని ఫైర్ అయ్యారు.

చంద్రబాబు మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ భగ భగ మండే సూర్యుడు లాంటోడని అన్నారు. అసెంబ్లీలో జరగని దానికి చంద్రబాబు దొంగ ఏడుపు ఏడ్చారని విమర్శించారు. చంద్రబాబు భార్యను ఎవరు కూడా ఏమనలేదని అన్నారు. 

 2024లో చంద్రబాబును రాజకీయ సమాధి చేస్తామని అన్నారు. చంద్రబాబు మానసిక వైద్యశాల ఏర్పాటు చేసి.. అందులో చేరుస్తామని చెప్పారు. దుష్టచతుష్టయాన్ని పూర్తిగా మానసిక వైద్యశాలలో చేర్పించాలన్నారు. 

Related posts