telugu navyamedia
ఆంధ్ర వార్తలు

బాలకృష్ణ ఒక అమాయక చక్రవర్తి..-పేర్ని నాని

అసెంబ్లీలో చంద్ర‌బాబుపైన, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పైన అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంపై నంద‌మూరి బాల‌కృష్ణ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వైసీపీ నాయ‌కుల‌కు వార్నింగ్ ఇచ్చారు. బాల‌కృష్ణ ప్రెస్ మీట్ అనంత‌రం ఏపీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి స్పందించారు.

చంద్రబాబు సతీమణి ప్రస్తవన శాసనసభలో రాలేదని, ఆమెను ఎవరూ ఏమీ అనలేదని అన్నారు. రాజకీయంగా లబ్ధి పొందడం కోసమే చంద్రబాబు ఈ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. శాసనసభలో చంద్రబాబు మెలో డ్రామా క్రియేట్ చేయ‌డం దుర‌దృష్ణ‌క‌రం అని అన్నారు. అసత్యాలు, నిందా పూర్వక ధోరణితో చంద్రబాబు కొత్త సంప్రదాయనికి తెరతీశారన్నారు. అంత సంస్కారం లేకుండా ఎవరూ మాట్లాడరని మంత్రి తెలిపారు.

మా ఎమ్మెల్యే లు పై అనవసరంగా విమర్శలు చేశారు. వైసీపీ సభ్యులు ఏదేదో అన్నట్లు నందమూరి కుటుంబం మాట్లాడుతోంది. మా ఇళ్లలోనూ ఆడవాళ్లు ఉన్నారు.. ఏం మాట్లాడాలో, మాట్లాడకూడదో మాకు తెలుసు. ఎన్టీఆర్ గురించి ఆయన సొంత కుటుంబ సభ్యుల్లోనే విషం ఎక్కించిన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ దుర్మార్గుడని సాక్షాత్తూ ఆయన కన్న బిడ్డలనే నమ్మించిన చరిత్ర టీడీపీ అధినేతకు ఉందని మంత్రి ఆరోపించారు. చంద్రబాబు ఆడుతున్న నాటకాలను బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబం గ్రహించాలి’ అని మంత్రి చెప్పుకొచ్చారు.

బాలకృష్ణ ఒక అమాయక చక్రవర్తి.. చంద్రబాబు ఏం చెప్తే అదే నిజమని అయన అనుకుంటున్నారు. అసలు అసెంబ్లీలో వ్యవసాయం మీద చర్చ జరుగుతుంటే దానిపై ఒక్క ప్రశ్న అయినా వేశారా.. అనవసర మాటలతో రాద్దాంతం చేసింది చంద్రబాబు’’ అంటూ మంత్రి పేర్ని నాని అసహనం వ్యక్తం చేశారు.

Related posts