telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సాక్షి బరితెగించి రాతలు రాసింది: సోమిరెడ్డి

somireddy brother into ycp today

 ఈటీవీకి అసెంబ్లీ లైవ్ అనుమతి నిరాకరించడం ప్రత్యక్ష కక్ష సాధింపేనని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  ట్విట్టర్ లోపేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పై మండిపడ్డారు. ఏ ప్రభుత్వానికైనా, పార్టీకైనా విమర్శలను ఎదుర్కొనే దమ్ముండాలన్నారు. వాస్తవాలు బయటకు వస్తాయనే ప్రభుత్వం ఏబీఎన్, టీవీ5 ప్రసారాలను మళ్లీ నిలిపివేసిందని ఆరోపించారు.

నిషేధం విధించినంత మాత్రాన నిజాలను బయటకు రాకుండా ప్రభుత్వం ఆపలేదని అన్నారు. ప్రభుత్వ చర్యలు ప్రజాస్వామ్యాన్ని ప్రత్యక్షంగా ఖూనీ చేయడమేనన్నారు. గత ఐదేళ్లలో సాక్షి బరితెగించి రాతలు రాసిందన్నారు. ఇప్పుడు సాక్షి రాసేది తప్పులని సీఎం జగన్ సెలవిస్తున్నారని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు.

Related posts