బీఎస్ఎఫ్ జవాన్లు భారత గగనతలంలో ఎగురుతున్న పాక్ కు చెందిన డ్రోన్ ను కూల్చి వేశారు. పంజాబ్ లోని ఖేమ్ కరర్ సెక్టార్ లో ఎగురుతున్న డ్రోన్ గుర్తించిన బలగాలు… క్షణాల్లోనే దాన్ని కూల్చి వేశాయి. పాక్ మళ్ళీ ఏదో ప్రణాళిక వేస్తున్నట్టుగా తేలడంతో, సరిహద్దు ప్రాంతాల్లో హైలర్ట్ ను ప్రకటించారు.
నిన్న రాత్రి రతోకే గ్రామంలో డ్రోన్ ఎగురుతుండగా బీఎస్ఎఫ్ దాన్ని పసిగట్టింది. వెంటనే యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్ తో దానిపై కాల్పులు జరిపింది. డ్రోన్ కూలిపోయినప్పటికీ…. అది భారత భూభాగంలో పడిపోయిందా? లేక పాక్ భూభాగంలో పడిపోయిందా? అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.