telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

విశాఖ స్టీల్ ప్లాంటులో రాష్ట్ర ప్రభుత్వం వాటా లేదు…

botsa ycp

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రవేటీకరణ చేయడం ఖాయం అని కేంద్రం నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… స్టీల్‌ ప్లాంట్‌పై తమ వైఖరి మారదని.. మా వంతు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు . ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని ప్రధానికి మా సీఎం ఇప్పటికే లేఖ రాశారని… మరి ప్రతిపక్ష టీడీపీ పార్టీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. టీడీపీ హయాంలోనే ప్రైవేటీకరణకు అంకురార్పణ జరిగింది కాబట్టే చంద్రబాబు కిమ్మనడం లేదన్నారు. చంద్రబాబు ఎప్పుడైనా ఏ విషయమైనా స్పష్టంగా చెప్పారా ? అని నిలదీశారు. నోరెత్తితే బండారం బయటపడుతోందనే…విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో  చంద్రబాబు  సైలెంట్ అయ్యారని.. విశాఖ స్టీల్ ప్లాంటులో రాష్ట్ర ప్రభుత్వం వాటా లేదని కేంద్రం కూడా స్పష్టం చేసిందని గుర్తు చేశారు. కానీ కొందరు వైసీపీపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కుకు మేం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు బొత్స సత్యనారాయణ. చూడాలి మరి ఈ విషయం లో ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts